చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట్ గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడికి దిగడంతో ముద్దంగుల వెంకటేష్(46) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. గత సర్పంచ్ ఎన్నికల్లో సహకరించలేదనే నెపంతో వెంకటేష్ను చంపారని బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. గాయపరిచిన ఇద్దరు వ్యక్తులు వెంకటేష్, యాదగిరిలకు చెందిన నాలుగు ఇళ్లపై మృతుని బంధువుల దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి కారును తగులబెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
One person was killed in a clash in Yadadri district