- Advertisement -
హైదరాబాద్: ప్రమాదవశాత్తు ఏడాది బాలిక భవనంపై నుంచి పడి మృతిచెందిన సంఘటన నగరంలోని హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. అక్షశర (1) తల్లిదండ్రులు భవనంలోని ఐదో అంతస్థులో ఉంటున్నారు. మద్యాహ్నం 2గంటలకు బాలిక సేఫ్టీ గ్రిల్ దాటి ముందుకు రావడంతో ఐదో అంతస్థు నుంచి కిందపడింది. వెంటనే గమనించిన కింది ఫ్లోర్లలో ఉన్న వారు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు బాలికను నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు చెప్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -