- Advertisement -
హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కెటిఎమ్ బైక్ పై వెళ్తున్న యువకుడికి కుక్క అడ్డం రావడంతో దాన్ని ఢీకొట్టి డివైడర్ పడిపోయాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో కుక్క కూడా చనిపోయింది. మరో వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -