Thursday, April 25, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒపి సేవలు నిలిపివేత

- Advertisement -
- Advertisement -

Gandhi hospital

 

హైదరాబాద్ : లాక్ డౌన్ నేపథ్యంలో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒపి సేవలను నిలిపివేశారు. కేవలం అత్యవసర కేసులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రులకు ప్రజలు రావడంతో పాటు, వైరస్ సైతం విస్తరించేందుకు అవకాశం ఉండడంతో అవుట్ పేషెంట్ సేవలను నిలిపివేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రులతో పాటు నగరంలోని కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రి, కోఠి ప్రసూతి ఆసుపత్రి, పేట్లబురుజు ఆసుపత్రితో పాటు నగరంలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో ఈనెల 31 వరకు ఒపి సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

 

OP Services closed in Government Hospitals
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News