ముంబై: మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ను ఒప్పో A15s పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది. 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ తో ధర రూ. 11,490లకు వినియోగదారులకు కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, వైట్, సిల్వర్ కలర్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్.. డిసెంబర్ 21 నుంచి అమెజాన్, రిటైల్ ఔట్లెట్ల ద్వారా ఫోన్లను కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఐసిఐసి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసిన కస్టమర్లకు అదనంగా 5శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. హెచ్డిఎఫ్సి కార్డుతో అమెజాన్ ద్వారా ఫోన్ కొన్నవారికి 10శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ఒప్పో ప్రకటించింది.
ఒప్పో A15s అద్భత ఫీచర్లు…
6.52 అంగుళాల డిస్ప్లే
మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్
8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 13+2+2 మెగా పిక్సల్ రియర్ కెమెరా
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
ఆండ్రాయిడ్ ఓఎస్, 4230mAh బ్యాటరీ కెపాసిటీ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.