Friday, March 29, 2024

ఎల్బినగర్ లో విషాదం.. అనుమానాస్పదంగా వైద్య విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

Dead Body

హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఎల్బినగర్ లో సాహితి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉస్మానియా డెంటల్ కాలేజీలో బిడిఎస్ చదువుతున్న సాహితి ఎల్బినగర్ లోని అలేఖ్య టవర్స్ లో ఉంటుుంది. అయితే, మంగళవారం అలేఖ్య టవర్స్ లో 14వ అంతస్తులోని బాల్కానీ నుంచి సాహితి కిందపడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఆమె చనిపోయింది. సమాచారం అందుకున్న ఎల్బినగర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

OU Medical Student falls to death from 14th Floor in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News