Thursday, April 25, 2024

కరెంట్ షాక్ తో ఎద్దు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో కరెంట్ షాక్ తో ఎద్దు చనిపోయింది.  వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన రైతు మహేందర్ రావు ఉదయమే దుక్కిటెద్దులతో వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు చేరుకున్నాడు. ఆ ఎడ్లను వేరే పని ఉండటం వలన పగ్గాలతో కట్టేసి అతని పనికి పోయాడు. ఒక ఎద్దు పగ్గాలను తెచ్చుకొని పచ్చగడ్డి తింటుండగా ప్రక్కనే ఉన్న కరెంట్ వైర్ కు తగలడంతో ఆ ఎద్దు అక్కడిక్కడే మృతి చెందింది. దాని విలువ రూ. 80 వేలు ఉంటుందని రైతు మహేందర్ రావు తెలిపారు.  రైతుకు అన్ని విధాలుగా కరెంట్ అధికారులు సహకరించాలని గ్రామస్థులు కోరారు. పంబిడి మహేందర్ రావు అనే రైతు గురువారం కరెంట్ షాక్ తో దుక్కిటెద్దు మృతి చెందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News