Friday, March 29, 2024

దాసరికి పద్మ పురస్కారం దక్కాలి

- Advertisement -
- Advertisement -

స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు విశిష్టత గురించి అందరికీ తెలిసిందే. ఆయన చేసిన సినిమాలు, అందుకున్న విజయాలు, చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ స్మరణీయమే. సుమారు 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు ఆయన. మంగళవారం ఆ మహనీయుడి 74వ జయంతి. ఈ సందర్బంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను స్మరించుకుంది. మెగాస్టార్ చిరంజీవి దాసరిని గుర్తు చేసుకున్నారు. విజయాలలో ఒకదాన్ని మించి మరో చిత్రాన్ని అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు.. నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకమేనని చిరు అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి ప్రభు త్వం నుండి తగిన గుర్తింపు రాకపోవడం ఒక తీరని లోటని, ఇప్పటికైనా ఆయనకు విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కే గౌరమవుతుందని అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News