Thursday, April 25, 2024

అవార్డుకు అవార్డుకు మధ్య గ్యాప్ ఇవ్వమ్మా: జక్కన్న

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం ప్రద్మ శ్రీ అవార్డు ప్రకటించడంతో దర్శకధీరుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. కీరవాణికి పద్మశ్రీ రావడంతో రాజమౌళి తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. పెద్దన్నకు వరసగా అవార్డులు తన సంతోషానికి అవధులు లేకుండాపోయాయని తెలిపారు. ఈ విశ్వానికి ఒకటే చెబుతున్నానని అవార్డుకు అవార్డుకు మధ్య గ్యాప్ ఇవ్వాలని కోరుతున్నానన్నారు. ఏ ఒక్క విజయాన్ని కీరవాణి పూర్తిగా అస్వాదించలేకపోతున్నాడని పేర్కొన్నారు.

ఒక వ్యక్తి కష్టానికి ప్రతిఫలంగా ఊహించని రీతిలో ఒక్కొక్కసారి గిఫ్ట్‌లు అందిస్తుందని జక్కన్న ప్రశంసించారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేసిన కీరవాణికి వరసగా అవార్డులు వచ్చి పడుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. బోస్టన్ సోసైటి ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్, క్రిటిక్ ఛాయిస్ మూవీ అవార్డు, లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు వరించాయి. భారత ప్రభుత్వం తరఫున ఆయనకు పద్మ శ్రీ అవార్డు రావడంతో ఆయన ఖ్యాతి మరింత పెరిగిందని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News