Tuesday, April 16, 2024

భారత నిఘా హెలికాప్టర్‌ను కూల్చేశాం: పాక్ ఆర్మీ

- Advertisement -
- Advertisement -

 

ఇస్లామాబాద్‌ః భారత్‌కు చెందిన నిఘా హెలికాప్టర్(ఖ్వాడ్‌కాప్టర్)ను కూల్చి వేసినట్టు పాకిస్థాన్ సైన్యం శనివారం ప్రకటించింది. సరిహద్దు రేఖ(ఎల్‌ఓసి)ను దాటి తమ భూభాగంలోకి 500 మీటర్లమేర చొచ్చుకు వచ్చినందున కూల్చి వేసినట్టు పాకిస్థాన్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తిఖార్ తెలిపారు. ఖంజార్ సెక్టార్‌లో ఈ సంఘటన జరిగిందని ఆయన అన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు భారత్‌కు చెందిన 8 నిఘా హెలికాప్టర్లను కూల్చి వేసినట్టు ఆయన తెలిపారు. అయితే, మే 27న ఒకటి, మే29న ఒకటి కూల్చి వేసినట్టుగా ఇంతకుముందు పాకిస్థాన్ చేసిన ప్రకటనల్ని భారత్ ఖండించింది. ఖ్వాడ్ కాప్టర్లు మానవ రహిత హెలికాప్టర్లన్నది గమనార్హం.

Pak army dismantled India intelligence helicopter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News