Saturday, April 20, 2024

బెలూచీ కాల్పుల్లో ఇద్దరు సైనికుల మృతి

- Advertisement -
- Advertisement -

Pakistan Two soldiers killed in Balochistan

క్వెట్టా : పాకిస్థాన్‌లోని కల్లోలిత బెలూచిస్థాన్‌లో ఓ సాయుధుడి కాల్పుల్లో ఇద్దరు పాకిస్థానీ సైనికులు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. కెచ్ జిల్లాలోని బులెడా పర్వత ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని సాయుధుడు దక్షిణ ప్రాంతపు సరిహద్దుల సైనిక దళపు కాన్వాయ్‌పై దాడికి దిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కాల్పులలో లాన్స్ నాయక్ , ఓ సిపాయి మృతి చెందినట్లు వెల్లడైంది. దుండగుడిపై వెంటనే అక్కడున్న సైనిక దళాలు ఎదురుదాడికి దిగాయి. అయితే ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఇటీవలి కాలంలో బెలూచిస్థాన్‌లో తెహరీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) రెబెల్స్, బలోచ్ నేషనలిస్టు శక్తులు హింసాకాండకు దిగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News