హైదరాబాద్ : రైతుల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రైతు సమన్వయ సమితిని ఏర్పటు చేసి దానికి చైర్మన్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించింది. శుక్రవారం రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతు.. రైతును రాజు చేయడమే సిఎం కెసిఆర్ సంకల్పమని, రైతుబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం సిఎం కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, రైతులను సంఘటితం చేయడమే రైతు సమన్వయ సమితి లక్ష్యంమన్నారు. తెలంగాణ 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు తమకు కూడా కావాలని ఇతర రాష్ర్టాలు.. ఆయా ప్రభుత్వాలను అడుగుతున్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సిఎం కెసిఆర్ శరవేగంగా పూర్తి చేశారు అని పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లోని రైతు సమన్వయ సమితి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు మహముద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పల్లా రాజేశ్వర్రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.