Thursday, March 28, 2024

రెండో రౌండ్ కౌంటింగ్ ఆధిక్యంలో పల్లా

- Advertisement -
- Advertisement -

Palla Rajeshwar Reddy Lead In Second Round

హైదరాబాద్: నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ గురువారం కొనసాగుతుంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. అందులోనూ టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 15,857 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్లలో కలిపి టిఆర్ఎస్ 7,871 ఓట్ల ఆధిక్యం ఉంది. రెండో రౌండ్ లో 55,991 ఓట్లు లెక్కించారు. అందులో చెల్లిన ఓట్లు-52,982 ఉండగా, చెల్లని ఓట్లు -3,009 ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి తీర్మార్ మల్లన్న 12,070 ఓట్లు, కోదండరామ్ కు 9,448, బిజెపి ప్రేమేందర్ రెడ్డికి 6,669, కాంగ్రెస్ రాములు నాయక్ కు 3,244 ఓట్లు వచ్చాయి.

Palla Rajeshwar Reddy Lead In Second Round

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News