Thursday, April 25, 2024

హార్రర్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ బిర్యానీలాంటి పసందైన వినోదం పంచేందుకు ఈనెల 21న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఫస్ గయే యారో’. ‘అబ్ ఆయేగీ కిస్కీ బారి?’ ట్యాగ్ లైన్ తో ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మాత రూపేష్ డి.గోహిల్ నిర్మించిన ఈ హిలేరియస్ హార్రర్ ఎంటర్‌టైనర్‌కి యూసఫ్ సర్తి దర్శకత్వం వహించారు. దక్కన్ స్టార్ మస్త్ అలీ, అజీజ్ నజీర్, ఏలీన టుతేజా, రేష్మా బరి, నజియా ఖాన్, నిర్మల్ దిలీప్ రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు సయ్యద్ హుస్సేన్ సారధ్యంలో హైదరాబాద్ -ప్రసాద్ ల్యాబ్‌లో ‘ఫస్ గయే యారో‘ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇఫ్తేకర్ షరీఫ్, సయ్యద్ అక్బర్ హుస్సేన్, బెక్కెం వేణుగోపాల్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుకలో రూపేష్ డి.గోహిల్,- ఎం.విజయలక్ష్మి, -ఓం ప్రకాష్ భట్-, ధనంజయ్ మాసూమ్, సోను గుప్తా, మస్త్ అలీ, యూసఫ్ సర్తి తదితరులు పాల్గొన్నారు. దక్కన్ సినిమాలకు రోజురోజుకు విపరీతమైన ఆదరణ పెరుగుతోందని, ఈ చిత్రాలకు రాయితీలిచ్చి మరింత ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. హార్రర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘ఫస్ గయే యారో’ ఖచ్చితంగా సంచలన విజయం సాధిస్తుందని వారు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News