Wednesday, April 24, 2024

రిషబ్ షెట్టికి పంజుర్లి దైవ వార్నింగ్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంతార చిత్ర విజయోత్సవం తర్వాత కాంతార సీక్వెల్ తీసేందుకు చిత్ర దర్శక, రచయిత, కథానాయకుడు రిషబ్ షెట్టి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన తన చిత్ర యూనిట్‌తో కలసి పంజుర్లి దైవ ఆశీస్సులు తీసుకున్నారు. కాంతార చిత్ర షూటింగ్‌కు ముందు కూడా పంజుర్లి దైవ ఆశీస్సులు అందుకున్న రిషబ్ షెట్టి కాంతార సీక్వెల్ చిత్ర నిర్మాణానికి పంజుర్లి దైవ అనుమతి కోరిన సందర్భంగా ఆయనకు పంజుర్లి దైవ నుంచి ఆశీస్సులతో పాటు కొన్ని హెచ్చరికలు కూడా అందినట్లు కర్నాటకలోని మంగళూరు వివార్లలోని కద్రి మంజునాథేశ్వర ఆలయం వద్ద ఇటీవల జరిగిన భూత కోలకు రిషబ్ షెట్టి, సప్తమి గౌడ, విజయ్ కిర్గందూర్ తదితరులు హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణ ఆడిగ సక్షంలో కాంతార సీక్వెల్ నిర్మాణానికి అనుమతి కోసం పంజుర్లి దైవను రిషబ్ షెట్టి కోరగా సంపూర్ణ ఆశీస్సులు లభించాయి. అయితే.. చిత్ర నిర్మాణానికి ముందు కొన్ని నియమాలు పాటించాలని రిషబ్ షెట్టిని పంజుర్లి దైవ హెచ్చరించినట్లు తెలిసింది.

మొదటి చిత్రం తరహాలోనే ఎంతో నియమ నిష్ఠలతో రెండవ భాగాన్ని కూడా తీయాలని పంజుర్లి దైవ సూచించినట్లు తెలుస్తోంది. కాంతార చిత్రాన్ని తీసేముందు 10 సార్లు ఆలోచించావని, అయినప్పటికీ కొన్ని తప్పులు చేశావని రిషబ్‌తో అన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ తప్పులను క్షమించానని, ఇప్పుడు కాంతార సీక్వెల్‌కు ముందు 100 సార్లు ఆలోచించమని పంజుర్లి సూచించినట్లు తెలుస్తోంది. సీక్వెల్‌లో కూడా ఇదే బృందంతో వెళ్లాలని, ఎటువంటి నియమాలు పాలించాలో వీరికి తెలుసుకాబట్టి వీరినే కొనసాగించాలని పంజుర్లి దైవ సూచించినట్లు సమాచారం. స్వచ్చమైన మనసుతో, ఎటువంటి దురాశ లేకుండా చిత్రాన్ని నిర్మించాలని, సినిమా విజయానికి తాను భరోసాఇస్తున్నానని పంజుర్లి దైవ రిషబ్ షెట్టికి సూచించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది రెండవ భాగంలో కాంతార సీక్వెల్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News