Friday, April 26, 2024

రోడ్డుపై పడిపోయిన ఆరోగ్య సిబ్బంది…..

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: కరోనా రోగులకు చికిత్స చేసే ఆరోగ్య సిబ్బందిలో ఒకరు అపస్మారక స్థితిలోకి పోయిన సంఘటన మధ్య ప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగింది. పిపిఇ కిట్లు ధరించిన పారా మెడికల్ సిబ్బందిని కరోనా రోగులకు చికిత్స చేసేందుకు టివి ఆస్పత్రి నుంచి బుందేల్ ఖండ్ ఆస్పత్రికి పంపించారు. కరోనా రోగులకు చికిత్స చేసిన అనంతరం టివి ఆస్పత్రికి వస్తుండగా పారా మెడికల్ సిబ్బందిలో ఒకరు కిందపడిపోయారు. అతడి సహాయం చేయాల్సిన తోటి ఉద్యోగుల పట్టించుకోకుండా వెళ్లిపోయారు. స్థానికులు ఇది గమనించి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని స్పృహ కోల్పోయిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బిపి తక్కువ కావడంతో పడిపోయి ఉంటాడని ఆస్పత్రి వర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News