Friday, April 19, 2024

అనాథలైన పిల్లలు

- Advertisement -
- Advertisement -

Parents

 

రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా ప్రాణాలతో బయటపడిన రాజు, హర్షిత

మన తెలంగాణ/సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలోని భూ ంపల్లి ,లింగంపల్లి గ్రామాల స్టేజీల మధ్య మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఎస్‌ఐ జగడం నరేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోతంగల కలాన్(వి) గ్రామానికి చెందిన గంగిరెద్దుల సా యిలు (35 ), సావిత్రి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇ ద్ద రు కూతుళ్లు ఉన్నారు. సావిత్రికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు చిన్న కొడుకు రాజు, చిన్న కూతురు హర్షితతో కలిసి సాయిలు బైక్‌పై కామారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు.

వైద్యం చేయించుకున్న అనంతరం స్వగ్రామానికి వస్తుండగా మార్గ మధ్యంలో గాంధారి నుంచి పద్మాజీవాడ వైపు వెళుతున్న వ్యాన్ వేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయిలు, సావిత్రిలు ఘటనాస్థలిలోనే చనిపోయారు. రాజు, హర్షితలకు స్వల్ప గాయాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్ నిర్లక్షం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సాయిలు తల్లి ఎంకవ్వ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరింది. పోస్టుమార్టం కోసం సాయిలు, సావిత్రిల మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరి మృతితో వారి పిల్లలు అనాథయ్యారు.

 

Parents killed in road accident
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News