న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం తెలిపారు. కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న సమర్పిస్తారు. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను(లోక్సభ, రాజ్యసభ) ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. అయితే ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో మొదలవుతాయా లేక పాత పార్లమెంటు భవనంలోనే జరుగుతాయా అన్నది స్పష్టం కాలేదు.
‘బడ్జెట్ సమావేశం 2023 జనవరి 31 నుంచి మొదలయి ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుంది. ఈ సమావేశంలో 27 సిట్టింగులు ఉండనున్నాయి. అవి 66 రోజులపాటు ఉంటాయి. కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలు జరుగుతాయి’ అని పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోసి తెలిపారు.
Budget Session, 2023 of Parliament will commence from 31 January and continue till 6 April with 27 sittings spread over 66 days with usual recess. Amid Amrit Kaal looking forward to discussions on Motion of Thanks on the President’s Address, Union Budget & other items. pic.twitter.com/IEFjW2EUv0
— Pralhad Joshi (@JoshiPralhad) January 13, 2023