Friday, March 29, 2024

టీమిండియా మాజీ క్రికెట‌ర్‌కు పితృ వియోగం

- Advertisement -
- Advertisement -

Parthiv Patel's father Ajaybhai Bipinchandra Patel passed away

న్యూఢిల్లీ: ఇండియన్ టీమ్ మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ తండ్రి అజ‌య్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని పార్థివ్ పటేలే ట్విటర్ ద్వారా వెల్లడించాడు. అంతకుముందు బ్రెయిన్ హేమరేజ్ కారణంగా పార్థివ్ తండ్రి బిపిన్చంద్రను అహ్మదాబాద్లోని ఓ హాస్పిటల్లో చేర్చారు. ఆయన రెండేళ్లుగా ఈ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. 2019లో తన తండ్రి అనారోగ్యం గురించి పార్థివ్ పటేల్ వెల్లడించాడు. అతని తండ్రి మృతి పట్ల మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజాలు సంతాపం తెలిపారు. 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పార్థివ్ పటేల్.. గతేడాది అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియా తరఫున పార్థివ్ 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News