తిరువనంతపురం: మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో బాధితురాలిని పెళ్లి చేసుకోవడంతో పాటు ఆమెకు పుట్టిన పాపకు పోషిస్తానని నిందితుడు హైకోర్టు ముందు విన్నవించిన సంఘటన కేరళలోని కన్నూరులో జరిగింది. రాబిన్ వడక్కమ్ చెర్రీ (50) అనే పాస్టర్ 2016లో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఫిబ్రవరి 7, 2017లో క్రిస్తు రాజ్ ఆస్పత్రిలో బాధితురాలు పండంటి బిడ్డకు జన్మనించింది. 2017 ఫిబ్రవరిలో రాబిన్పై పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కోర్టు అతడికి 60 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బాధితురాలు మేజర్ కావడంతో ఆమెను పెళ్లి చేసుకొని పుట్టిన పాపను పోషిస్తానని కోర్టుకు తెలిపాడు. కోర్టు డిఎన్ఎ టెస్టు చేసిన తరువాత వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. బాధితురాలు కూడా అతడిని పెళ్లి చేసుకొని తన పాపతో కలిసి ఉంటానని కోర్టుకు తెలిపింది. ఈ ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది.