- Advertisement -
ఢిల్లీ: మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆస్పత్రి బాత్రూమ్లో ఉరేసుకున్న సంఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజ్మనీ సత్తార్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి మానసికంగా ఒత్తిడిలో ఉన్నాడు. మానసిక స్థితి సరిగ్గాలేకపోవడంతో అతడిని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం వార్డుకు తరలించారు. రాజ్మనీ బాత్రూమ్కు వెళ్లి చిన్న బట్టతో ఉరేసుకున్నాడు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని బలవంతంగా డోర్ ఓపెన్ చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -