Friday, March 29, 2024

పవన్-చంద్రబాబు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు: పేర్ని నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ నాటకాలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఇటీవల చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీపై పేర్ని నాని స్పందిస్తూ.. చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా తమ రాజకీయ కార్యకలాపాలపై అదే వాదనలు చేస్తున్నారని మాజీ మంత్రి అన్నారు. 2019 ఎన్నికల సమయంలో వ్యతిరేక ఓటుని చీల్చేందుకు విడిపోయారు. ఇప్పుడు వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక్కటవుతున్నారని పేర్నినాని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News