- Advertisement -
అమరావతి: ప్రభుత్వ ఆర్డినెన్స్లను హైకోర్టు కొట్టివేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం కలిగించదన్నారు. ఎన్ఇసి తొలగింపుపై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని ప్రశంసించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసినందుకు ఎపి ప్రభుత్వం అతడిని తొలగించిన విషయం తెలిసిందే. 2016 జనవరి 30న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ఐదు సంవత్సరాల పాటు ఎపి ఎన్నికల కమిషనర్గా నియమించారు. నిమ్మగడ్డ పదవీ కాలం 2016 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై 2021 మార్చి నెలాఖరు వరకు ముగియనుంది.
- Advertisement -