Friday, March 29, 2024

మరో లెవెల్‌లో రొమాన్స్..

- Advertisement -
- Advertisement -

నటించిన తొలి సినిమాతోనే యువతరం మనసు దోచింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్‌ఎక్స్ 100’ లాంటి బ్లాక్ బస్టర్‌తో ఘనమైన ఆరంగేట్రం చేసిన పాయల్‌కి ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ సరసన ‘వెంకీమామ’లో నటించే ఆఫర్ దక్కింది. ఆ సినిమా విజయం సాధించింది. కానీ ఎందుకనో ఆ తరువాత ఆశించిన స్థాయి అవకాశాలైతే రాలేదు. ఆ క్రమంలోనే పాయల్ కోలీవుడ్ లోనూ అవకాశాల కోసం ప్రయత్నించింది. కానీ అక్కడా కెరీర్ అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఆది సాయికుమార్ సరసన నటించేందుకు సంతకం చేసింది. ఆది, పాయల్ జంటగా ‘కిరాతక’ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఆగస్టు నుంచి పాయల్ సెట్స్‌లో చేరనుందని సమాచారం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కథాంశంతో వీరభద్రమ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఆగస్టు 13న ప్రారంభమవుతుంది. పాయల్‌తో ఆది రొమాన్స్ మరో లెవెల్‌లో ఉంటుందని తెలిసింది.

Payal Rajput to Romance with Aadi Saikumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News