Tuesday, April 16, 2024

ఘనంగా చంద్రపట్నం

- Advertisement -
- Advertisement -

కొనసాగుతున్న భక్తుల రాక
నేడు నెలవారం

దేవరపెట్టె ముందు చంద్రపటం వేసి లింగమంతుల స్వామికి ఆచార వ్యవహారాలతో పూజలు నిర్వహిస్తున్న యాదవ భక్తులు

Peddagattu jatara information in telugu

మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి/చివ్వెంల: పెద్దగట్టు జాతరలో ప్రధాన ఘట్టం మంగళవారంతో ముగిసింది. గత మూడు రోజుల క్రితం ప్రారంభమైన జాతరలో మంగళవారం చంద్రపట్నం వేసిన బైకాని వారు.. లింగమంతులస్వామి, మాణిక్యమ్మల కళ్యాణాన్ని ఘనం నిర్వహించారు. ఈ తంతుతో జాతరలో ప్రధాన ఘ పూర్తి అయినట్లే స్వామివారి కల్యాణం, చంద్రపట్నం, ఘటాన్ని తిలకించేందుకు యాదవ భక్తులు మం ఉదయం నుంచే పెద్దగట్టుకు పోటెత్తారు. కల్యా అనంతరం భక్తుల దర్శనార్ధం దేరవెపెట్టేను లింగమంతుల స్వామి, చౌడమ్మ ఆలయాల మధ్యన ఉంచారు. బుధవారం దేవాలయ శాఖ ఆధ్వర్యంలో యాదవ కులపెద్దలు నెలవారం కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఘనంగా చంద్రపట్నం, స్వామి వారి కల్యాణం
పెద్దగట్టు జాతరలో ప్రధాన అంశమైన చంద్రపట్నం కార్యక్రమం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదవ సాంప్రదాయ ప్రకారం గొల్ల హక్కుదారులు తమ అందుకే అశ్రితులైన బైకాని వారితో చంద్రపట్నం వేయించారు. ముందుగా బైకాని వారు వాయిద్యాలు వాయిస్తూ కథాగానం చేస్తూ చంద్రపట్నం వేసే ప్రాంతాన్ని శుభ్రపర్చి మైశాచి పొగ వేశారు. ఆ ప్రాంతంలో దీర్ఘచతురస్రాకారంలో చందనం చల్లారు. ఈ చందనం నగిషీ చెక్కల పలకలపై పసుపు, కుంకుమ, తెల్లపిండి, పచ్చపిండిలను అద్ది పదహారు గడుల చంద్రపట్నం పరిచారు. బైకాని వాయిద్యాల మధ్య చంద్రపట్నం మీదికి దేవరపెట్టెను తెచ్చి చంద్రపట్నంపై రెండు పోలు ముంతలు పెట్టి, పోలుదారం చుట్టారు. వాటి ముందు రెండు మట్టి కంచుడులు పెట్టి నువ్వుల నూనె పోసి వత్తులు పెట్టి జ్యోతిలు వెలిగించారు. అనంతరం చంద్రపట్నం ముందు రుమాలు పరిచి బియ్యంతో బైరవ, పోతరాజులకు వేర్వేరుగా పోలువేశారు. బైరవ పోలుపై తొమ్మిది కుండులు పోతరాజుపై కూడ కుండలు పెట్టారు. ఆ సమయంలో మెంతబోయిన వారు చంద్రపట్నం ముందు అవసరాలను ఎత్తారు. అనంతరం లింగమంతుల స్వామి మాణిక్యమ్మ కల్యాణంను ఘనంగా నిర్వహించారు. కల్యాణానికి అవసరమైన దుస్తులు, వస్తువులు ఇతర పదార్ధాలు మొన్న, మెంతబోయిన వారు సమకూర్చగా బైక్ కానీ వారు పూజారులుగా వ్యవహరించారు. అనంతరం యాదవుల ఆచారం ప్రకారం గొళ్లకులం పుట్టుక, వృత్తాంతం లింగమంతుల స్వామి మాణిక్యమ్మ చరిత్రను కూడా తెలిసేఆ బైకాని వారు పాటలు పాడారు. దీంతో చంద్రపట్నం, స్వామి వారి కల్యాణం ముగిసింది. అనంతరం మెంతబోయిన వారు డప్పు చప్పుళ్లు, బేరీ నృత్యాలతో ఊరేగింపుగా కేసారంకు వెళ్లారు.
కొనసాగుతున్న భక్తుల రాక…
పెద్దగట్టు జాతర ప్రారంభమై మూడు రోజులవుతున్నా భక్తులు మాత్రం ప్రతి రోజు తిరుగుతూనే ఉన్నారు. ఉదయం వేళలో కొద్ది కొద్దిగా వస్తున్న భక్త జనం, మధ్యాహ్నం వరకు ఆలయం కింది ప్రాంతాలు గట్టుపై ఆలయాలు ముందు నిండిపోతున్నారు. లింగ.. ఓ లింగా.. నామస్మరణతో లింగమంతుల స్వామి చౌడమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు పోటెత్తుతున్నారు. సూర్యాపేట పట్టణం నుండి కోదాడ, గరిడేపల్లి నుండి మూడు వైపులా వాహనాలు పెద్దగట్టుకు వస్తున్నాయి. ఒక పక్క బస్సులు, ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాలతో భక్తులు పెద్దగట్టుకు చేరుకుంటున్నారు. గత రెండు రోజులుగా జాతరకు రాలేని భక్తులు మంగళవారం గంపల ప్రదక్షిణ చేయడం, బోనాలు సమర్పించడం, దేవతామూర్తులకు జంతు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మున్సిపాలిటీ అధికారులు ఎగ్జిభిషన్‌ను నిలిపివేశారన్న సమాచారంతో మంగళవారం ఉదయం వరకు కొద్ది మేరకు భక్తులు హాజరైనా.. సాయంత్రం తర్వాత సమీప పట్టణాలు, గ్రామాల్లోని భక్తజనం పెద్దగట్టుకు లైన్లు కడుతున్నారు. లింగమంతుల స్వామి చౌడమ్మలను ఎంచుకోవడం అటు నుండి ఎగ్జిబిషన్ వైపు వెళ్లడం కొనసాగుతుంది.
నేడు నెలవారం…
పెద్దగట్టు జాతర నాలుగో రోజైన బుధవారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నెలవారం కార్యక్రమం నిర్వహించనున్నారు. నెలవారీ కార్యక్రమం తర్వాతి రోజు దేవరపెట్టె, మకరతోరణాలు తరలింపుతో జాతర పరివర్తనం అవుతుంది. గత మూడు రోజులుగా జరుగుతున్న జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు రాక కొనసాగుతుండగా, ఝార్ఖండ్, ఒడిశా నుండి కూడా భక్తులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
జాతరలో నిరంతర నిఘా: భూక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
పెద్దగట్టు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు ఎప్పటికప్పుడు తమకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించి సమన్వయంతో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జాతర మూడో రోజు మంగళవారం పెద్దగట్టు ప్రాంతంలో విధులు కేటాయించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా, ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నందున నీటి వసతిలో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూడాలని ఆదేశించారు. తప్పిపోయిన 22 మంది భక్తుల పిల్లలను వారి కుటుంబ సభ్యులకు అందించామని, జాతరలో పిల్లలు తప్పిపోతే వెంటనే మర్రి చెట్టుకింద, పోలీసు కంట్రోల్ రూంలలో వెంటనే సమాచారం అందించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
పోలీసు తరపున పెద్దగట్టుకు బోనం సమర్పణ
చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందర్భంగా జిల్లా పోలీసుల తరపున లింగమంతుల స్వామికి మంగళవారం బోనం సమర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్, డిఎస్పీ మోహన్‌కుమార్‌తో కలిసి లింగమంతుల స్వామి, చౌడమ్మలను దర్శించుకొని పూజలు చేశారు. పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్న ఎస్పీ భాస్కరన్‌ను ఆలయ ఈఓ కె.కుశలయ్య సాదర స్వాగతం పలికి సన్మానించారు. అంతకు ముందు మహిళీ పోలీసు సిబ్బందికి లింగమంతుల స్వామికి ప్రత్యేకం బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్పీ వెంట సిఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News