Friday, March 29, 2024

వైరస్ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ktr

మనతెలంగాణ/హైదరాబాద్: నువ్వు బ్రతకడానికి… తోటి వారికి బ్రతికే అవకాశం ఇవ్వడానికి… ఈ వైరస్ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందనని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు తన ట్వీట్ ద్వారా ప్రజలను అభ్యర్థించారు. లాక్ అవుట్ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య… ప్రభుత్వం అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అంటే పరస్థితిని అర్థం చేసుకోవాలి అని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌కు ప్రజలందరూ తమవంతు సహాకారాన్ని అందించి తమ మద్దతును తెలపాలని ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం లాక్ డౌన్ అనే తీవ్రమైన నిర్ణయం తీసుకున్నదంటే ప్రజల క్షేమానికి ఎంత ప్రాధాన్యతనిస్తుందో గ్రహించాలని, ఈ వైరస్ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందేనని మంత్రి కెటిఆర్ వివరించారు.

People mus Cooperative to Lockdown: KTR tweet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News