Friday, March 29, 2024

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

115 కంటి పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి తలసాని

హైదరాబాద్: ప్రభుత్వం ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కోరారు. అంధత్వంతో ఏ ఒకరు బాధపడొద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈగొప్ప కార్యక్రమం చేపట్టారని తెలిపారు. మొదటి విడుతలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో 1.54లక్షల మందికి కంటి పరీక్షలునిర్వహించి 50లక్షల మందికి కళ్ళదాలు అందజేసినట్లు పేర్కొన్నారు.

రెండో విడుతలో జూన్ 30వ తేదీవరకు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిధిలో 115 కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈశిబిరాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ళదాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగానే కంటి ఆపరేషన్‌లు చేయించడం జరుగుతుందని వివరించారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కాలనీ,బస్తీల కమిటీల సభ్యులు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒకరు తమ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం జరిపి ఈకార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిధిలో 115 శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అవసరాన్ని బట్టి అదనపు శిబిరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News