Friday, April 26, 2024

తెలుగువాడి మదిలో చెరగని ముద్ర వేశారు: పేర్ని నాని

- Advertisement -
- Advertisement -

Perni Nani pay tribute to Sirivennela

హైదరాబాద్: తెలుగు సినీ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి ఎపి మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. అనంతరం సిరివెన్నెల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ”తెలుగు అక్షరాలు 56. తెలుగు నేర్చిన ప్రతి వాడికీ అవే మూలం. అలాంటి అక్షరాలతో పద విన్యాసం చేసి, ప్రతి తెలుగువాడి మదిలో చెరగని ముద్రవేసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగుజాతి గర్వపడేలా తన కలాన్ని కదిలించిన గీత రచయిత, సాహితీకారుడు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తరపున ఘన నివాళి అర్పిస్తున్నాం. సిరివెన్నెల కుటుంబానికి ఏపి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

Perni Nani pay tribute to Sirivennela

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News