Friday, March 29, 2024

మరోసారి పెరిగిన చమురు ధరలు

- Advertisement -
- Advertisement -

Record petrol price hike expected next week

న్యూఢిల్లీ: దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగాయి. రోజురోజుకు ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒక రోజు విరామం తర్వాత తాజాగా ఆదివారం పెట్రోల్‌పై లీటర్‌కు 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు వరకు పెంచాయి. కొత్తగా ధరలతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.21, డీజిల్ రూ.84.07కు పెరిగింది. ముంబయి నగరంలో దాదాపు వందకు చేరింది. లీటర్‌ పెట్రోల్‌ రూ.99.49, డీజిల్‌ రూ.91.30కు పెరిగింది. ఈ నెలలో ఇప్పటి వరకు 12 సార్లు పెట్రో ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై దాదాపు రూ.2.81, డీజిల్‌పై రూ.3.34 పెంచాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News