- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ చమురు ధరలు పెరిగాయి. వరుసగా 21 రోజులపాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒకరోజు తర్వాత సోమవారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్పై 5 పైసలు, డీజిల్పై 13 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చుమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.43, డీజిల్ ధర రూ.80.53కు చేరింది. దీంతో పెట్రోల్ ధరను డీజిల్ దాటేసింది.
ఇక, హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.83.49, డీజిల్ ధర రూ.78.69కు చేరుకుంది. కాగా, ఇప్పటివరకు పెట్రోల్పై రూ.9.23, డీజిల్పై రూ.10.39లు పెరిగాయి. ఇలా వరుసగా చమురు ధరల పెంపుపై వాహనాదారులు ఆందోళనలు వ్యక్తం చేస్తునారు.
Petrol and Diesel prices hiked again in India
- Advertisement -