Thursday, March 28, 2024

ఆన్‌లైన్ విధానంలో పిజి కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

PG Counseling in Online Policy

 

22 వరకు సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. లాసెట్, ఎడ్‌సెట్ తరహాలో పిజి కౌన్సెలింగ్ కూడా మొదటిసారి ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. పిజిగెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌లో తమ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలని కన్వీనర్ ఎన్.కిషన్ పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 30 లేదా 31వ తేదీన మొదటి విడత పిజి సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టింగ్ చేసే సమయంలో వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీస్తారు. పిజి తరగతులు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News