Saturday, April 20, 2024

ఆటో డ్రైవర్ల పిల్లకు ‘పియాజియో’ స్కాలర్‌షిప్

- Advertisement -
- Advertisement -

Piaggio offers scholarships for auto driver children

 

న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాజియో సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సమాజిక బాధ్యత) కార్యక్రమాల్లో భాగంగా ఆటోలను నడిపే డ్రైవర్‌ల పిల్లలకు స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. మహాత్మాగాంధీ 151వ జయంతికి జాతి సన్నద్ధమవుతున్న సమయంలో ‘శిక్షా సే సమృద్ధి’ అనే ఈ ఉపకారవేతన కార్యక్రమాన్ని సంస్థ ప్రకటించింది. ఈ కార్యక్రమం ఆటోరిక్షా డ్రైవర్ కమ్యూనిటీకి చెందిన తల్లితండ్రులు, సంరక్షకుల పిల్లల కోసం ఉద్దేశించింది. ఉన్నత విద్య కొనసాగించాలనుకునే వారికి,పాలిటెక్నిక్, ఐటిఐ లాంటి సాంకేతిక, వొకేషనల్ కోర్సులు చేయాలనుకునే వారికి ఈ కార్యక్రమం కింద పియాజియో తోడ్పాడునందిస్తోంది. స్కాలర్‌షిప్ కోసం హెల్ప్ లైన్ (180-012-05577), www.buddy4study.comవెబ్ లింక్‌ను అందివ్వగా, ఈ లింక్ అక్టోబర్ 2 నుంచి పని చేయడం ప్రారంభిస్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News