- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ముఖ్య సలహాదారు పదవికి పికె సిన్హా రాజీనామా చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. 1977 ఐఎఎస్ బ్యాచ్కి చెందిన రిటైర్డ్ అధికారి సిన్హా ప్రధానికి ముఖ్య సలహాదారుగా 2019 సెప్టెంబర్లో నియమితులయ్యారు. నాలుగేళ్లపాటు కేబినెట్ కార్యదర్శిగా పని చేసిన సిన్హాను మొదట 2019 ఆగస్టులో ప్రధానికి ఒఎస్డిగా నియమించారు. ఆ తర్వాత సలహాదారుగా పదోన్నతి కల్పించారు. ప్రధానిగా మోడీ కొనసాగినంతకాలం సలహాదారుగా ఉండే అవకాశముండగా, సిన్హా రాజీనామా చేయడం గమనార్హం.
- Advertisement -