Thursday, March 28, 2024

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత: ఎంపి రంజిత్ రెడ్డి 

- Advertisement -
- Advertisement -

Plant care is everyone's responsibility says chevella MP

చేవెళ్ల ఎంపిరంజిత్ రెడ్డి

చేవెళ్ల: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు రామయ్యగూడలో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాదు.. మొక్కల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సిఎం కెసిఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారన్నారు. మూడవ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నగరంలోని వార్డులో ఆయన పర్యటించారు. పట్టణ ప్రగతితో కాలనీలు పరిశుభ్రంగా మారుతున్నాయని చెప్పారు. ఏడవ హరితహారంలో భాగంగా రంజిత్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం నూతన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ తదతరులు పాల్గొన్నారు.

Plant care is everyone’s responsibility says chevella MP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News