న్యూఢిల్లీ: కరోనా వైరస్ తో బాధపుడుతున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (55) కు ప్రైవేట్ ఆస్పత్రిలో ప్లాస్మాథెరిపీ చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి శుక్రవారం సాయంత్రం ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. శనివారం ఉదయం ఆయనకు ప్లాస్మాథెరిపీ చికిత్స అందించారు. నిన్నటి నుంచి సత్యేంద్ర జైన్ హైబిపి, జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సత్యేంద్ర జైన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 24గంటల పాటు ఐసియులో పరిశీలనలో ఉంచుతామని వైద్యులు తెలిపారు. జూన్ 17వ తేదీన ఢిల్లీ మంత్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా సోకడంతో ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖలను డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాకు అప్పగించారు.
Plasma Therapy treatment for Delhi Health Minister