- Advertisement -
న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు సహకరిస్తామని, అవసరమైన వైద్య ఉత్పత్తులను ఆటంకం లేకుండా ఎగుమతి చేస్తామని ప్రధాని మోడీ మంగళవారం ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడోకు హామీ ఇచ్చారు. రెండు దేశాలకు సంబంధించి వివిధ అంశాలపై ఇరువురూ చర్చించారు. ఈమేరకు అధికారులు అందుబాటులో ఉండేందుకు వీరు అంగీకరించారు. కరోనా మహమ్మారితో ఏర్పడిన ఆర్థిక, వైద్య సవాళ్లను ఎదుర్కోడానికి సన్నిహిత సముద్రతీర దేశాలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వాములైన ఇండేనేషియా, భారత్ మధ్య పరస్పర సహకారం అవసరమని మోడీ వివరించారు. జొకో విడోడో తనకు మంచి మిత్రుడని ఆయన ట్వీట్ చేశారు.
PM Modi assures to Indonesia in fight over corona
- Advertisement -