గుజరాత్ సిఎంగా, ప్రధానిగా అధికారంలో
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాధినేతగా గురువారం నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 13 ఏళ్లకు పైగా గుజరాత్ ముఖ్యమంత్రిగా, గడచిన ఏడేళ్లుగా ప్రధానిగా పదవిలో కొనసాగుతున్న మోడీకి బిజెపి నాయకులతోసహా ఆయన క్యాబినెట్ సహచరులు అభినందనలు తెలిపారు. మోడీ నాయకత్వంలో సుపరిపాలన, సుస్థిర అభివృద్ధి కొనసాగుతోందని వారంతా ప్రశంసించారు. గుజరాత్ ముఖ్యమంత్రి 2001 అక్టోబర్ 7వ తేదీన అధికారాన్ని చేపట్టిన నరేంద్ర మోడీ పాలనలో ప్రారంభమైన సుపరిపాలన, అభివృద్ధి ప్పటికీ నిరంతరంగా కొనసాగుతోందని గడచిన మూడు దశాబ్దాలుగా మోడీకి అత్యంత సన్నిహితునిగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశ ప్రజల కోసం, దేశ ప్రగతి కోసం ప్రధాని మోడీ రాత్రీపగలూ పనిచేస్తున్నారంటూ ఆయన ప్రశంసించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ 2001-2014 మధ్య కొనసాగారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ప్రధాని మోడీని విశ్వగురుగా అభివర్ణించారు. కర్మ యోగిలా శ్రమించిన మోడీ నవ భారతదేశ నిర్మాణం కోసం ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పారని నడ్డా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు.