Friday, March 29, 2024

యుపిలో మూడు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi Inaugurates 3 Mega Projects In UP

గోరఖ్‌పూర్ (యుపి) : ఉత్తరప్రదేశ్‌లో ఎఐఐఎంఎస్, భారీ ఎరువుల కర్మాగారంతో పాటు మూడు మెగా ప్రాజెక్టులను ప్రధాని మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు. ఇవన్నీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ స్వంత నియోజక వర్గం లోనివే కావడం గమనార్హం. ఇతర ప్రాజెక్టులో ఐసిఎంఆర్ కు చెందిన రీజినల్ మెడికల్ రీసెర్చి సెంటర్ కూడా ప్రారంభమైంది. ఈ మూడు భారీ ప్రాజెక్టుల వ్యయం దాదాపు రూ. 9600 కోట్లు. ఎరువుల కర్మాగారాన్ని హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ సంస్థ (హెచ్‌యుఆర్‌ఎల్ ) నిర్వహిస్తుంది. గోరఖ్‌పూర్‌లో రూ. 1011 కోట్లలో ఎఐఐఎంఎస్ ఏర్పాటవుతోంది. దీనివల్ల తూర్పు ఉత్తరప్రదేశ్‌కే కాకుండా, బీహార్, ఝార్ఖండ్, నేపాల్ ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విధంగా రూ. 36 కోట్లతో రీజినల్ మెడికల్ రీసెర్చి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అంటువ్యాధులకు సంబంధించిన పరీక్షలు ఇక్కడ జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News