కజలంగ్: కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజుకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అరుదైన ప్రశంసలు దక్కాయి. ఒక ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు బుధవారం అరుణాచల్ ప్రదేశ్లోని ఒక గామాన్ని సందర్శించిన రిజిజు అక్కడి స్థానికులతో కలసి నృత్యం చేయడాన్ని చూసిన వీడియోలో చూసిన ప్రధాని మోడీ రిజిజును మంచి డ్యాన్సర్గా ప్రశంసించారు. కజలంగ్ గ్రామానికి చెందిన స్థానిక సజలోంగ్ తెగకు చెందిన ప్రజలు(వీరిని మిజీ అని కూడా పిలుస్తారు) కేంద్ర మంత్రికి సాంప్రదాయక పాటలు, నృత్యాలతో స్వాగతం పలికారు. షర్ట్, ట్రౌజర్లు, స్నీకర్స్ ధరించిన రిజిజు గ్రామస్తుల ఆటపాటలకు తాను కూడా కాలు కదిపారు. డప్పులు ఇతర సాంప్రదాయక సంగీత పరికరాలతో వారు పాడిన జానపద పాటలకు మంత్రి నృత్యంత చేయగా అక్కడ గుమికూడిన గ్రామస్తులు చప్పట్లతో మంత్రిని ఉత్సాహపరిచారు. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను మంత్రి సోషల్ మీడియా కూలో పోస్ట్ చేయగా ప్రధాని దాన్ని వీక్షించి రిజిజును అభినందించారు.
కేంద్ర మంత్రి రిజిజు నృత్యానికి ప్రధాని మోడీ ప్రశంసలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -