Friday, March 29, 2024

జపాన్ ప్రధాని కిషిడాకు మోడీ ఫోన్

- Advertisement -
- Advertisement -

PM Modi talks to Japan's new prime minister

న్యూఢిల్లీ: జపాన్ నూతన ప్రధాన మంత్రిగా ఎన్నికైన ఫుమియో కిషిడాతో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. తమ రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు కలసి పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోడీ జపాన్ ప్రధానికి తెలియచేశారు. జపాన్ పార్లమెంట్ గత సోమవారం తమ దేశ నూతన ప్రధానిగా కిషిడాను ఎన్నుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఒక ట్వీట్ చేస్తూ జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఫుమియో కిషిడాకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపరుచుకుందామన్న ఆకాంక్షను మోడీ వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News