Friday, March 29, 2024

బాలిలో భేటీ కాబోతున్న మోడీ, రిషి సునాక్

- Advertisement -
- Advertisement -

Rishi Sunark and Modi

న్యూఢిల్లీ:   బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోడీలు ఇండొనేషియాలోని బాలిలో వచ్చే నెల జీ20 లీడర్ షిప్ సమ్మిట్ సందర్భంగా భేటీ కాబోతున్నారు. ఈ సమావేశాల్లో  ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు ఇరువురూ అంగీకారం తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించి బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ లు ప్రపంచ ఆర్థికశక్తులుగా మరింత వికసించేందుకు ఇరు దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయడానికి సమ్మతం తెలిపారని ప్రకటనలో పేర్కొంది. ఇండొనేషియాలో జరిగే సమ్మిట్ లో ఇరువురు ప్రధానులు చర్చలు జరుపుతారంది. మరోవైపు యూకె ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ అంశాన్ని రిషి దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News