- Advertisement -
న్యూఢిల్లీ: నౌకాదళ దినోత్సవం(నేవీ డే) సందర్భంగా నౌకాదళ సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది అసమాన ధైర్యసాహసాలను, వృత్తి నిబద్ధతను ఆయన ప్రశంసించారు. మన నౌకాదళ సిబ్బంది అసమాన ధైర్య సాహసాలను, వృత్తి పట్ల వారి నిబద్ధతను యావత్ ప్రపంచం గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వంటి సంక్షోభ పరిస్థితులు ఏర్పడినపుడు పరిస్థితిని ఎదుర్కొనడానికి నౌకాదళ సిబ్బంది ముందు నిలబడతారని ఆయన అన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం జరుగుతుంది. 1971లో ఇదే రోజున భారత్-పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా శత్రు నౌకలను ధ్వంసం చేయడానికి భారత నౌకాదళం తన క్షిపణి పడవలతో ఆపరేషన్ ట్రైడెంట్ నిర్వహించింది.
PM Modi Wishes to naval personnel on Navy Day
- Advertisement -