Friday, April 19, 2024

రాష్ట్రపతితో ప్రధాని మోడీ కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

PM Narendra Modi Meets President Ram Nath Kovind

న్యూఢిల్లీ : వారణాసి పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ గురువారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను కలిశారు. అనేక కీలక అంశాలపై ఆయనతో ప్రధాని చర్చించినట్టు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఈ భేటీలో దేనిపై చర్చించారో వివరాలు మాత్రం పేర్కొనలేదు. ఈనెల 19 నుంచి ఆగస్టు13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిరువురి భేటీ కావడం గమనార్హం. గురువారం ఉదయం ప్రధాని మోడీ వారణాసిలో రూ.1500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. కరోనాను అరికట్టడానికి యుపి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురిపించారు.

PM Narendra Modi Meets President Ram Nath Kovind

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News