Tuesday, April 23, 2024

ప్రియురాలి కోసం స్నేహితుడితో విషం తాగించాడు

- Advertisement -
- Advertisement -

Poisoned with A Friend For Lover At Guntur

అమరావతి: గుంటూరు జిల్లా యడ్లపాడులో దారణం చోటుచేసుకుంది. ప్రియురాలి కోసం ఓ యువకుడు స్నేహితుడితో గడ్డిమందు తాగించాడు. వివరాల్లోకి వెళితే… స్థానికంగా ఉండే గోపీవర్మ, ప్రేమ్ చంద్ స్నేహితులు. వీరు ఒకే యువతిని ప్రేమించారు. ప్రేమ వ్యవహారంలో గత కొద్దికాలంగా స్నేహితుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రేమ్ చంద్ కలిసి చనిపోదామని గోపీ వర్మను నమ్మించాడు. కూల్ డ్రింకులో గడ్డిమందు కలిపి గోపీవర్మకు తాగించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోపీ మృతి చెందాడు. బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం మార్చురీకి తరలించారు. అనంతరం ప్రేమ్ చంద్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Poisoned with A Friend For Lover At Guntur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News