- Advertisement -
మేడ్చల్: నగరంలోని ఎటిఎంల దగ్గర మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితులు అమాయకుల నుంచి డెబిట్ కార్డులను దొంగిలించారు. అసలైన కార్డులు తీసుకుని ఖాతాదారులకు నకిలీ కార్డులు ఇచ్చారు. డెబిట్ కార్డు దొంగిలించిన తర్వాత పిన్ నంబర్ తెలుసుకుని డబ్బులు స్వాహా చేస్తారు. నిందితులను స్వాత్విక్ రెడ్డి(18), జోసెఫ్ రెడ్డి(36)గా పోలీసులు గుర్తించారు. వీరి దగ్గరి నుంచి 50 నకిలీ కార్డులు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు వీరు మొత్తం 37 ఎటిఎంల వద్ద మోసాలకు పాల్పడ్డారు. నిందితులు నుంచి 41 నకిలీ ఎంటిఎం కార్డులు, రూ.2.97 లక్షలు, బైక్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
Police arrested two ATM fraudsters
- Advertisement -