మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ విభాగాలు చేపట్టే ఉద్యోగ నియమకాలకు గాను సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ను ఆన్ లైన్ ద్వారా చేపట్టే విధానాన్ని మంగళవారం నాడు డి.జి.పి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని పోలీస్ జోనల్ ఐ.జీ. లు, కమీషనర్లు, ఎస్.పీ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ ఐ- వేరిఫై ఇ విధానాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియమకాలతో పాటు విదేశాలకు వెళ్లే అభ్యర్థులు తమ సర్టిఫికేట్లు, ఉద్యోగ, వ్యాపార, ఇమ్మిగ్రేషన్ లకై పోలీసు క్లీయరెన్స్ సర్టిఫికేట్లకై దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఆధునీకరించి ఆటోమెటెడ్ పోలీసు వేరిఫికేషన్ సర్టిఫికేషన్, పోలీసు క్లీయరెన్స్ సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సర్వీస్ లను పొందే వ్యక్తులు, సంస్థలు https://www.tspolice.gov.in వెబ్ సైట్ ద్వారా పోలీసు వెరిఫికేషన్, క్లీయరెన్స్ అనే లింక్ ను టిక్ చేయడం ద్వారా పూర్తి వివరాలు పొందవచ్చని తెలిపారు.