- Advertisement -
న్యూఢిల్లీ : భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్పై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల సహచరుడు రోహిత్ శర్మతో జరిగిన ఇన్ స్టా లైవ్లో దళితులను కించపరిచేలా ఓ పదాన్ని వాడాడు. దీనిపై హర్యానాకు చెందిన ఓ దళిత నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి స్పందించిన హర్యానా పోలీసులు యువరాజ్పై కేసును నమోదు చేశారు. ఇన్స్టా లైవ్లో పాల్గొన్న యువరాజ్ భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ను ఉద్దేశించి చేసిన ఓ వ్యాఖ్యపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యువరాజ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు కోరుతున్నారు. యువరాజ్ వాడిన భాంగి అనే పదం దళితులను కించపరిచే విధంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు
- Advertisement -