Friday, March 29, 2024

ఎంఎల్‌ఎ రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Conflict between Minister Jagadish Reddy and MLA Rajagopal Reddy

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి: మునుగోడు ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డిపై చౌట్టుపల్ పోలిస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. సోమవారం చౌటుప్పల్‌లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి చేతిలో ఉన్న మైకును గుంజుకున్న ఘటనపై స్థానిక పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. దీంతో రాజగోపాల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు అయింది. సోమవారం మంత్రి జగదీశ్వర్ రెడ్డి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎంఎల్‌ఎ రాజగోపాల్ రెడ్డిపై స్థానిక చౌటుప్పల్ పీస్‌లో కేసు నమోదు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రేషన్ కార్డులను పంపి ణీ జరిగిన నేపథ్యంలో చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో ఈ సంఘటన రాజకీయ చర్చకు దారి తీసింది.

Police filed Case against MLA Rajagopal Reddy

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News