Friday, April 19, 2024

అమ్మాయిలకు వేధింపులు: బుద్ధి చెప్పిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

Police make two persons do squats in Madhya Pradesh

భోపాల్: రోడ్లపై అమ్మాయిలను వేధిస్తున్న ఇద్దరు పోకిరిలకు పోలీసులు రోడ్డుపైనే బుద్ధి చెప్పి, వారితో బింగిళ్లు తీయిస్తూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో శనివారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు పోకిరీల చెవులు పట్టుకుని దేవాస్ వీధిలో కొట్టుకుంటూ తిప్పుతూ స్టేషన్ కు తీసుకుపోయారు. పోలీసులు వారికి నడిరోడ్డుపై అందరిముందూ బుద్ధిచెప్పడంపై నెటిజన్లు పోలీసులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి వాళ్లను అందరి ముందూ శిక్షిస్తేనే ఇలాంటి పనులు చేయడానికి భయపడతారని నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News