- Advertisement -
సూర్యాపేట: తాను చనిపోతున్నానని ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో గ్రామస్థులు సమాచారం మేరకు ఆ యువకుడిని పోలీసులు రక్షించిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీదచందుపట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి అన్నెపర్తి బెటాలియన్ లో కానిస్టేబుల్గా పని చేశాడు. మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో అతడిని కుటుంబ సభ్యులు వదిలేశారు. ఎవరు పట్టించుకోకపోవడంతో ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. చందుపట్ల గ్రామస్థులు ఎస్ఐ లోకేష్కు సమాచారం ఇవ్వడంతో అతడి సెల్ఫోన్ నెట్ వర్క్ ఆధారంగా యువకుడిని గుర్తించామని కృష్ణా జిల్లా పెనుగంటి ప్రోలులో ఉన్నట్టు గుర్తించి పోలీసులు అతడిని రక్షించారు.
- Advertisement -